డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ హీరోయిన్లు సంజనా గల్రాణి, రాగిణి ద్వివేదీ లకు కర్నాటక హైకోర్టు బెయిల్ నిరాకరించింది. వివిధ ఈవెంట్లకు, పార్టీలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే ఆరోపణలపై ఈ ఇద్దరిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
రాగిణిని సెప్టెంబర్ 4వ తేదీన అరెస్టు చేయగా సంజనాను 8వ తేదీ అరెస్టు చేశారు. నార్కాటిక్స్ స్పెషల్ కోర్టు వీరి బెయిల్ పిటిషన్ ను తిరస్కరించగా హైకోర్టులో బెయిల్ పిటిషన్ లు దాఖలు చేశారు. అయితే బెంగళూరు హైకోర్టు జస్టిస్ శ్రీనివాస్ హరీష్ కుమార్ వీరి బెయిల్ పిటిషన్ ను తిరస్కరించారు.