మన సంస్కృతి సంప్రదాయాలకు సంక్రాంతి పండుగ ప్రతీక అని రామంతపూర్ మాజీ కార్పొరేటర్ గంధం జోష్ణ నాగేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం అరవింద్ నగర్ స్ట్రీట్ నెంబర్.1 లో మాజి కార్పొరేటర్ గంథం జొత్స్నా నాగేశ్వరావు అద్వర్యం లో సంక్రాంతి పండగ సందర్బంగా ముగ్గులపోటీని నిర్వహించారు. ముగ్గులు పోటిలో విజేతలుగా నిలిచిన మహిళలకు ప్రథమ,ద్వితీయ , తృతీయ, కన్సోలేషన్ బహుమతులను గంధం జోష్ణ నాగేశ్వరావు ప్రధానం చేశారు. ప్రథమ బహుమతి దివ్య, ద్వితీయ బహుమతి నవనీత,తృతీయ బహుమతి ప్రసన్నలు గెలవగా కన్సల్టేషన్ బహుమతులు ముగ్గుల పోటిలో పాల్గొన్న ప్రతి మహిళకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా
మాజి కార్పొరేటర్ మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలకు సంక్రాంతి పండుగ చిహ్నమని,ప్రజలకు తెలియజేసేందుకు ముగ్గుల పోటిలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రంగు రంగుల ముగ్గులతో అరవింద్ నగర్ కాలనీ కళకళ లాడిందనీ ప్రజల సంతోషమే తన సంతోషమని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నేత గంధం నాగేశ్వరరావు, లక్శ్మి ,విజయలక్ష్మి ,రాణి,పారిజాత,శ్రావంతి మరియు తెరాస నాయకులు ,కొప్పు నర్సింగ్ రావు,బొసాని పవన్,రామచంద్ర చారి,వెంకటేష్ చారి,గొపి చారి ,ఆలే రమేష్ ,మనీష్ ,రవి తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి