సంక్రాంతి పండుగ సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి నరసరావుపేట పట్టణ, పరిసర గ్రామాలకు విచ్చేసిన ప్రజలకు తిరిగి వెళ్లేందుకు నరసరావుపేట బస్టాండు నుండి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఏ పి యస్ ఆర్ టి సి గుంటూరు జిల్లా నరసరావుపేట డిపో మేనేజర్ యస్ కె అబ్దుల్ సలామ్ తెలిపారు.
శనివారంనాడు ఆయన విలేఖరుల సమావేశం లో మాట్లాడుతూ ప్రయాణీకుల సౌకర్యం కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
ఏర్పాటుచేసిన స్పెషల్ బస్సుల వివరాలు:
16-01-2021 న హైదరాబాదుకు 4 సూపర్ లగ్జరీ బస్సులు, 3 ఆల్ట్రా డీలక్స్ బస్సులు
17-01-2021 న హైదరాబాదుకు 5 సూపర్ లగ్జరీ బస్సులు, 4 ఆల్ట్రా డీలక్స్ బస్సులు
18-01-2021 న హైదరాబాద్ కు 4 సూపర్ లగ్జరీ బస్సులు, 3 అల్ట్రా డీలక్స్ బస్సులు
19-01-2021 న హైదరాబాద్ కు 3 సూపర్ లగ్జరీ బస్సులు, 3 అల్ట్రా డీలక్స్ బస్సులు
17-01-2021 న చెన్నై కు 1 సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ తెలిపారు.
పైన ఏర్పాటు చేసిన బస్సులే కాకుండా ప్రయాణికుల రద్దీ మేరకు అదనంగా కూడా బస్సులు ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు.