తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసంలో గల కౌంటర్లలో డిసెంబర్ 21న సాయంత్రం 5 గంటలకు టైంస్లాట్ సర్వదర్శనం టోకెన్ కౌంటర్లను మూసివేస్తారు. డిసెంబర్ 22, 23, 24వ తేదీలకు సంబంధించిన టోకెన్లను కూడా డిసెంబర్ 21వ తేదీ లోపు జారీ చేస్తారు. భక్తులు ఈ మార్పును గమనించి టిటిడికి సహకరించాల్సిందిగా ఆలయాధికారులు విజ్ఞప్తి చేశారు.
కోవిడ్ నిబంధనలను పరిగణనలోకి తీసుకుని, గతంలో జరిగిన శాంతిభద్రతలు, ఇతర అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ పర్యాయం వైకుంఠ ఏకాదశి సర్వదర్శనం టోకెన్లు స్థానికులకు మాత్రమే పరిమితం చేయడమైందన్నారు. స్థానికేతరులెవ్వరూ టోకెన్ల కోసం రావద్దని సూచించారు. స్థానికులు కూడా ఆధార్ కార్డు తీసుకుని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్దేశించిన 5 ప్రాంతాలకు వచ్చి టోకెన్లు పొందాలని స్పష్టం చేశారు.