దొరతనమును పరతనముగ నెంచి
జనహితమును తన మతముగా భావించి
భూసంస్కరణలను భూమార్గమున పట్టించి
రైతుల కళ్ళల్లో కలల సాగుకు పట్టం కడుతూ
సాగుభూమిని వదులుకున్న త్యాగజీవి మన పీ. వి.
పుస్తకాల హృదయాలను తడుముతూ
అన్యభాషల లో అలవోకగా అక్షర సేద్యం చేస్తూ
నిరంతరం మౌనాన్ని కప్పుకున్న లోపలిమనిషి
ఆధ్యాత్మిక చింతన శిఖరాగ్రానికి చేరువై
పీఠాధిపతి కాబోయిన కర్మయోగి మన పీ. వి.
సమస్యలెన్నో శరములై చుట్టుముట్టినా
మది మందిరంలో పరిష్కారాలను శోధిస్తూ
చీత్కారాలును సత్కారాలు గా మలచుకుని
జన గళం, కుల బలం అండదండగా లేకుండా
ఢిల్లీ పీఠంపై తేజరిల్లిన తెలుగు కీర్తి మన పీ.వి
నాణ్యమైన చదువులకు నవోదయం చూపుతూ
బడుగు వర్గాల ఒడికి చదువుల తల్లిని చేర్చి
ఆర్థిక సుడిగుండాల ఆకలికి బలికాకుండా దేశాన్ని
సంక్షేమ తీరానికి చేర్చిన ప్రజ్ఞా పరంగు తానై
కర్మభూమి సేవలో పరిశ్రమించిన కర్మకుడు మన పీ వి
జాగరపు శంకరరావు, విజయనగరం జిల్లా, 8074861324