సీ: బహుముఖ ప్రజ్ఞయు బహుభాష పాండిత్య
మునుగల్గి వెల్గిన ఘనుడు పీ.వి
విశ్వనాథునియొక్క వేయి పడగలను
హిందీకి ననువాద మొందఁజేసె
మంత్రియును,ప్రధాన మంత్రి పదవినొంది
నపరచాణక్యుడై యవతరించె
తెలుగు వెలుగును తెలిపె ప్రపంచాన
పాలనాదక్షుడై పరిడ విల్లి
తే: పీ.వి నరసింహు డాతని ఠీవిఁజూచి
తీవ్రవాది భయంబుతో తేలిపోయె
దక్కరించె నిజామును యెక్కడైనఁ
దెలుగు గడ్డ గర్వించెడి తెనుగు బిడ్డ
తే: వ్యక్తి నిశ్శబ్దమైనను యుక్తి నెరపు
నెంత యెత్తున కెదిగిన నెగిరి పడక
నొదిగి యుండియే పనులకుఁబదును పెట్టి
విజయ దుందుభి మ్రోగించు వీరుడుగను
ఆ.వె: సంస్కరణలు సేసి సంతస మందించె
దేశ మార్థికమును ధీరుడిగను
ప్రగతి పథమునందె భారతావని బోవ
స్థితిని గతిని మార్చి తిరముఁజేసె
-కుందారపు గురుమూర్తి, కలసపాడు మండలం, కడపజిల్లా.చరవాణి:7780656292