తెలంగాణా తల్లి వడిలో చదివి
రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగి
సంస్కరణలతో సంపద సృష్టించి
అపర చాణిక్యునిగా నిలచి పాలించెను..
సరస్వతీ వీణను తన బాణీ గా చేసుకొని
బహుభాషాలకు భాష్యం చెప్పి
బహుముఖ ప్రజ్ఞాశాలిగా వెన్నెల
వెలుగులు తెలుగు నేలన నింపేను..
పంచకట్టులో తెలుగుదనం
పదాల తేనేపట్టులో అనంత భావం
నడకలో తెలుగు వీరుని దర్జాతనం
నడతలో మౌనముని విలువల సౌరభం….
చేతనైనది చేతల్లో చూపించి
చేయుతనిచ్చే మెండైన దాతృత్వం
వివాదాల చిక్కుముడులు చక్కదిద్దే నిగ్రహం
స్వచ్ఛమైన స్వేచ్ఛకు నిలివెత్తు నిదర్శనం…..
రాజకీయ విలువలకు ప్రాణవాయువుగా
అందలమెక్కిన పదవులకు చిరునామాగా
మచ్చలేని మహానాయకునిగా
ప్రజలలో సేవాడురందరునిగా
వెలిగే…..
మనసేరిగిన మానవతావాది గా
స్ఫూర్తి శిఖరానికి కొలమానంగా
కట్టు బడిన ఆదర్శయాలకు ఆద్యునిగా
కీర్తిలో అపర బ్రహ్మగా నిలిచెను
పాములపర్తి వెంకట నారసింహ రావు……
చివుకుల వాసుదేవమూర్తి, హైదరాబాద్, సెల్..9849651444