మార్చి 23న దేశవ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలపై నిర్వహించనున్న” సేవ్ జర్నలిజం” ను విజయవంతం చేయాలని టియుడబ్ల్యూజే యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోల నాగేశ్వరరావు కోరారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన యూనియన్ సమావేశంలో కోల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఆదేశాల మేరకు అన్ని డివిజన్ కేంద్రాలలో నిర్వహించనున్న ఆందోళన కార్యక్రమానికి జర్నలిస్టులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లోని రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు నాగేశ్వరరావు వెల్లడించారు.
ఈ సమావేశంలో టివిఎల్,బాసవోజు శ్రీనివాసాచారి,దాచేపల్లి దయాకర్ రెడ్డి, పిల్లలమర్రి శ్రీనివాస్ రావు,కిత రామనాథం, దేనమకొండ శేషం రాజు,దేవరం రాంరెడ్డి, ఆర్పీ గౌడ్,వెంకటరెడ్డి,చిట్టిపోతుల రమేష్ బాబు,కోమరాజు అంజయ్య ఇట్టిమల్ల రామకృష్ణ,ఇందిరాల రామకృష్ణ,రాజు, బాచిమంచి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్