తెలంగాణ ఉద్యమకారుడు, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ను ములుగు ఎమ్మెల్యే సీతక్క పరామర్శించారు.
కాలుకు శస్త్ర చికిత్స చేసుకొని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న ఆయనను సీతక్క శుక్రవారం కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.
ఆయన త్వరగా కోలుకోవాలని సీతక్క ఆకాంక్షించారు. సంపూర్ణ ఆరోగ్యం సమకూరిన తర్వాత ప్రజలకు అండగా నిలబడాలని ఆమె కోరారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాలని సీతక్క ఆకాంక్షించారు.