25.7 C
Hyderabad
May 24, 2025 07: 48 AM
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ లో ఒకే కుటుంబంలో ఆరుగురికి కరోనా

#Kollapur Corona case

కొల్లాపూర్ మండల పరిధిలోని గ్రామంలో ఒక వ్యక్తి నుండి కుటుంబ సభ్యులకు కరోనా వైరస్ వ్యాపించింది. పూర్తి వివరాల్లోకి వెళితే కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో ఎస్ బిఐ బ్యాంకు సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ  ఆయన సంగతి ఇదివరకు తెలిసిందే.అతని స్వగ్రామం కుడికిల్ల.

అతని కుటుంబ సభ్యుల నుండి నమూనాలు సేకరించి పరీక్షలు చేయగా మంగళవారం సాయంత్రం కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయినట్లు రిపోర్ట్ వచ్చింది. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో కొల్లాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.వెంకట్ రెడ్డి, వైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్ ఎస్ఐ కోంపల్లి మురళి గౌడ్ కుడికిళ్ల గ్రామానికి చేరుకొని  బాధితుల తో కలిసిన ప్రైమరీ కాంటాక్ట్స్ ను పరిశీలిస్తున్నారు.

ఇంటి పరిసర ప్రాంతాల్లో శానిటేషన్ చేశారు. మొత్తం ఒకే కుటుంబ సభ్యులు ఆరు మందికి కరోనా నిర్ధారణ కావడంతో కుడికిల్ల గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయాన్ని వైద్య అధికారి డాక్టర్.చంద్ర శేఖర్ తెలియజేశారు.

Related posts

సిఎఎ ఫైర్:జార్ఖండ్‌లోని లోహర్‌దగాలో ఇరువర్గాల ఘర్షణ

Satyam NEWS

ప్రకాశం జిల్లాలో గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్టు

Satyam NEWS

కటీ పతంగ్

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!