ఆదివారం ఉదయం 9:30 నిమిషములకు శ్రీకాకుళం పట్టణం ఆరంగి వీధిలో సీతారాముల కల్యాణోత్సవం చేస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు చీపురు శ్రీకాంత్ తెలిపారు. 10న శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో సీత రామ కళ్యాణ మహోత్సవము జరుపుతున్నట్లు తెలిపారు.
ఈ మహోత్సవం పురస్కరించుకుని శ్రీకాకుళం పట్టణం ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని వలసిందిగా కోరారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ ముఖ్య సభ్యులైన ఏ. ఉమామహేశ్వరరావు, డి . గోవింద్, ఏ ఈశ్వర్ రావు, డి. రమణ దేవ్, ఏ నర్సింగరావు, సిహెచ్ .శ్రీనివాస్, బి సురేష్, ముత్యాలు తదితర పెద్దలు పాల్గొంటున్నట్లు తెలిపారు.