శ్రీకాకుళం గ్రామీణ మండలం పెద్దపాడు ఉన్నత పాఠశాలకు చెందిన శెనగల ఝాన్సీకి ఏలూరులో జరిగిన రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలలో రజత పతకం దక్కింది.
76 కేజీల వ్యక్తిగత మహిళ విభాగంలో 100 కేజీలు బరువును ఎత్తి ఆమె ద్వితీయ స్థానాన్ని స్థానం సాధించింది.
ఆమె విజయం పట్ల పెద్దపాడు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మక్క శ్రీనివాసరావు, వ్యాయామ ఉపాధ్యాయుడు అయినా డాక్టర్ గుండబాల మోహన్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఆమెకు వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రత్యేక తర్ఫీదును ఇస్తున్న పెద్దపాడు వెయిట్ లిఫ్టింగ్ కోచ్ అప్పన్నకూడా ప్రత్యేకంగా అభినందించారు.
విద్యార్థిని సాధించిన విజయం పట్ల పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పి.సత్యవతి, యం. శాంతారావు, జి. భూషణ రావు, డి. ఎం.మల్లేశ్వరి, ఎస్.ఎల్.శివ జ్యోతి, ఏ. మాధవి భాయ్, పీ.వీ.జీ.లక్ష్మి, జె. లలిత, కె.సురేష్, ఆర్ట్, క్రాఫ్ట్ ఉపాధ్యాయులు సిహెచ్. రవి కుమార్ కుమార్, బి. త్రివేణి సంతోషం వ్యక్తం చేశారు.