40.2 C
Hyderabad
April 26, 2024 11: 03 AM
Slider వరంగల్

జీతం లేదు… పైగా ఇంట్లో పెళ్లాం గోల…

#SuicideAttempt

ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఆకులవారిఘణపురం కు చెందిన సాబీర్ అనే యువకుడు కన్నాయిగూడెం మండలం లోని ఆర్డబ్ల్యూఎస్ సంస్థ లో దినసరి కూలీగా పని చేసెవాడు.

గత 6 నెలలుగా వేతనాలు రాకపోవడంతో తరచూ ఇంట్లో భార్యతో గొడవలు జరుగుతుండడంతో మనస్థాపానికి గురైన సాబీర్ మద్యం సేవించి విద్యుత్ స్థంభం ఎక్కి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు.

అదే క్రమంలో మండల కేంద్రములో కరంటు మరమత్తు పనులు జరుగుతుండడంతో విద్యుత్ అధికారులు కరంటు నిలిపివేశారు.

కరంటు అంతరాయం ఉండడంతో ప్రమాదమేమి జరగగక పోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

గంట పాటు హల్ చల్ చేసిన యువకుడిని స్థానికులు ఎంత చెప్పినా వినక పోడంతో పోలీసులకు సమాచారం అందడంతో పోలీసుల రంగ ప్రవేశం యువకున్ని ఒప్పించి స్థానికుల సహాయంతో యువకున్ని కిందకు దింపి కౌన్సెలింగ్ నిమిత్తము పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు.

Related posts

ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు బ్యాంకులు

Satyam NEWS

సినీ నటుడు సంపూర్ణేష్ బాబుకు పెను ప్రమాదం

Satyam NEWS

నలుగురు మంత్రుల వ్యూహంలో నలిగిపోయిన ఎల్ వి

Satyam NEWS

Leave a Comment