దేశంలో కరోనా కారణంగా వ్యాక్సినేషన్ ఇంకా జోరుగా సాగుతోంది. కోవిడ్ను అరికట్టే చర్యల్లో భాగంగా యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి తదుపరి అర్డర్స్ లేనందున వచ్చే వారం నుంచి కొవిషీల్డ్ ఉత్పత్తిని 50 శాతం వరకు తగ్గించాలని నిర్ణయించినట్లు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా తెలిపారు.
ఒక వేళ అదనపు ఉత్పత్తి కావాలని కోరితే అప్పుడు సామర్థ్యాన్ని పెంచుతామని వెల్లడించారు. కేంద్రం సైతం 20 నుంచి 30 మిలియన్ డోసుల స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ను నిల్వ ఉంచుతుందని అదర్ అన్నారు.