బైంసా లో జరిగిన అల్లర్లలో నష్టపోయిన బాధిత కుటుంబాలకు నిర్మల్ సేవా సమితి ఆధ్వర్యంలో అవసరమైన బట్టలు ఇతర సామాగ్రి అందచేసిన విషయం తెలిసిందే. సంఘటన జరిగిన రెండు రోజులకే వీటిని అందచేశారు. ఇప్పుడు బాధిత కుటుంబాలకు టాక్స్ కన్సల్టెంట్ పోలిశెట్టి రాజు వారి కుటుంబీకులు వారి అమ్మ జ్ఞాపకార్ధం 30 చీరలు, 20 పాయింట్, షార్ట్స్ ఇచ్చారు. త్వరలో వీటిని బైంసా బాధితులకు అందజేస్తామని అధ్యక్షులు నాయిడి రమేష్ చెప్పారు. ఈ కార్యక్రమములో సాదం ఆనంద్, బొద్దుల రమణ, రామారావు, వై సాయన్న, నరాల దాస్ పాల్గొన్నారు.
previous post