దేశ యువత బాధ్యత వారి భవిష్యత్తు పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువత కోసం తీసుకున్న ఎన్నో అభివృద్ధి పథకాలను, మోదీ నాయకత్వానికి ఆకర్షితులై యువత భారీ సంఖ్యలో భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారని కేంద్ర మంత్రివర్యులు జి.కిషన్ రెడ్డి అన్నారు. నల్లకుంట డివిజన్ కు చెందిన యువత కు ఆ పార్టీ కండువా కప్పి యువతను బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎన్.గౌతం రావులు ఆహ్వానించారు.
ఈ కార్యక్రమం లో నల్లకుంట డివిజన్ కార్పొరేటర్ వై.అమృత బీజేపీ నల్లకుంట డివిజన్ అధ్యక్షు లు ఎం.శ్యామ్ రాజు, ప్రధాన కార్యదర్శి పి.మహేష్, గోల్నాక డివిజన్ కన్వీనర్ ఎం.రవీందర్ గౌడ్, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా యువమోర్చా ప్రధాన కార్యదర్శి ఏ. యశ్వంత్, జిల్లా యువ మోర్చా కార్యదర్శి కె.ప్రవీణ్, ప్రశాంత్ జోషి, బీజేవైఎం అంబర్పేట్ కన్వీనర్ కె.సునీల్, బీజేపీ నల్లకుంట డివిజన్ యువ మోర్చా అధ్యక్షులు ఎం. మల్లిఖార్జున్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట