సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో వివిధ పార్టీలకు చెందిన సుమారు 100 మంది కార్యకర్తలు ఆదివారం శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు.
పార్టీలో చేరిన వారికి టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి సైదిరెడ్డి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు టిఆర్ఎస్ పార్టీతోనే న్యాయం జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని అన్నారు.ప్రతి ఒక్క కార్యకర్తకు టిఆర్ఎస్ పార్టీ జెండానే శ్రీరామరక్ష అని,అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పోతూ అభివృద్ధిలో సిఎం కెసిఆర్ నేతృత్వంలో దూసుకుపోతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని అన్నారు.
కరోనా మహమ్మారితో ఆర్థికంగా కష్టాలు ఉన్నా ప్రజలపై భారం పడకుండా అభివృద్ధి ఫలాలను అందించిన ఘనత సిఎం కెసిఆర్ కే దక్కుతుందని,దళిత బంధు వంటి గొప్ప పథకాలని అన్ని నియోజకవర్గాలకు కేటాయించడంతో ప్రతి ఒక్కరిలో హర్షం వ్యక్తం అవుతుందని అన్నారు.దళిత అభ్యుదయం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వ్యక్తి కెసిఆర్ అని,టిఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రతి వ్యక్తికి సాదర స్వాగతం పలుకుతున్నామని అన్నారు.శ్రమించి పని చేసే ప్రతి కార్యకర్తకి తప్పక గుర్తింపు ఉంటుందని అన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్