బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు వెనకబడిన తరగతుల జాతీయ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి సోమవారంనాడు మూడు జిల్లాల పర్యటనకు వస్తున్నారు. ముందుగా నారాయణ పేట జిల్లా, నాగర్ కర్నూల్ జిల్లా లలో పర్యటించి జోగులాంబ గద్వాల జిల్లాకు ఆయన చేరుకుంటారు.
కల్వకుర్తి నుంచి రోడ్డు మార్గంలో ఆయన ఉదయం 8.30కి బయలుదేరతారు. నారాయణ పేట జిల్లా మాగనూరు మండలం నేరేడుగొమ్మ గ్రామలో ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఆ తర్వాత మక్తల్ ద్వారా అనుగొండ చేరుకుంటారు.
10.30కి అక్కడ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 11.30కి భూత్ పూర్ చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు జోగులాంబ గద్వాల చేరి బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారు. సాయంత్రం 6.30కి గద్వాల నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు.
అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్