మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ముస్లిం మైనారిటీలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా నియోజకవర్గంలోని అర్హులైన పేద ముస్లిం మైనారిటీలకు ప్రభుత్వ విప్ స్థానిక శాసనసభ్యులు అరెకపూడి గాంధీ, స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, తదితర డివిజన్ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులతో కలిసి కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంట్లోనే మహిళలకు ఉపాధి కల్పించేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇళ్లలోనే ఉంటూ కుట్టు మిషన్ ద్వారా మహిళలు ఆదాయం ఆర్జించే విధంగా పనిచేయాలన్నారు. దీంతో ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తదితర డివిజన్ ల కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, ముస్లిం మైనారిటీ మహిళలు తదితరులు పాల్గొన్నారు.
previous post