38.2 C
Hyderabad
April 29, 2024 14: 03 PM
Slider కరీంనగర్

లంచం తీసుకునే దరిద్రులారా ఈ తాళిబొట్టు తీసుకుని పని చేయండి

#rajanna sircilla dist

ఈ మాటలు చెప్పడమే కాదు ఒక మహిళ తన తాళిబొట్టును రెవెన్యూ అధికారులకు ఇచ్చి తన పని చేయమని బతిమాలుకున్నది.

ఈ లంచగొండులు దేశం మొత్తం ఉన్నా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాత్రం ప్రత్యేకంగా ఉన్నట్టున్నారు. రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 130/14 లో 2 ఎకరాల భూమి పొలాస రాజేశం కు పట్టాగా ఉంది.

రాజేశం మూడు సంవత్సరాల క్రితం చనిపోగా ఆ స్థలాన్ని తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది వేరే వాళ్లకు పట్టా ఇచ్చారు.

ఆయన భార్యగా తాను బతికే ఉన్నానని చెబుతూ రాజేశం భార్య మంగ ఆ పట్టా భూమి తనకు ఇవ్వాలని వేడుకుంటున్నది.

ఏళ్లుగా తిరుగుతున్నా ఎవరూ పని చేసి పెట్టడం లేదు. కారణం….. లంచం అనే దరిద్రం. బాధిత మహిళ ఉద్యోగ రీత్యా మెటపల్లి లో ఉంటుంది.

ఈ కారణంతోనే రాజేశం భూమిని వేరే వారికి ఇచ్చేశారట రెవెన్యూ అధికారులు. తనకు భర్త లేడాని కనీసం తనకు ఆధారమైన భూమినైన ఇప్పించాలని అధికారులను ఆమె వేడుకుంటుంది.

అయినా అధికారులు పని చేయకపోవడంతో ఆమె లంచంగా తన తాళిబొట్టును ఇచ్చేసింది. తనకు భర్త ఎలాగో లేడు అని తన తాళిబొట్టు తీసి ఆఫీస్ గెట్ కి వేలాడదీసింది.

ఈ తాళిబొట్టును లంచంగా తీసుకొని నా భూమి నాకు పట్టా చేయాలి అని ఆమె కోరుతున్నది… రెవెన్యూ అధికారులూ …. తీసుకోండి… ఈ తాళిబొట్టు తీసుకుని ఆమె పని చేసి పెట్టండి. ప్లీజ్.

Related posts

ప‌టిష్ట‌మైన బందోబ‌స్తుతో పంచాయితీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌

Satyam NEWS

బేగంపేట పరిధిలో మూడు నెలలపాటు ట్రాఫిక్‌ మళ్లింపు

Murali Krishna

అమ్మాయిలను ఏడిపించిన వారిని వదిలేది లేదు

Satyam NEWS

Leave a Comment