భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి కార్యక్రమం మంగళవారం పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షులు కూరెళ్ల శ్రీను ఆధ్వర్యంలో జరిగింది.
ఈ కార్యక్రమంలో కూరెళ్ల శ్రీను మాట్లాడుతూ ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధాన మంత్రులు, రెండు జాతీయ పతాకాలు ఉండకూడదన్న నినాదంతో ముందుకు సాగిన మహానుభావులు జన జన సంఘ వ్యవస్థాపకులు శ్యాం ప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గోశిక వెంకటేశం, పట్టణ ప్రధాన కార్యదర్శి గంజి గోవర్ధన్, దళిత మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాస శ్రీనివాస్, మాజీ కిసాన్ మోర్చా అధికార ప్రతినిధి చికీలమెట్ల అశోక్, జిల్లా కిసాన్మోర్చా కార్యదర్శి కన్నెబోయిన మహలింగం, పల్లె వెంకన్న, జిట్టా కృష్ణ, జయారపు రామకృష్ణ, గుండాల నరేష్, పాల రవి వర్మ ,శివాజీ.సతీష్, పొన్నం ఈశ్వర్, నక్క నవీన్, పురం ప్రశాంత్, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు