నిర్మల్ జిల్లా మామడ మండల కేంద్రంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్ 2015 జూలై 5న నాటిన రావి మొక్క ! అదిప్పుడు చెట్టయింది.
పల్లె ప్రగతి, హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు మామడకు వచ్చిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి…. పోలీస్ స్టేషన్ ఆవరణలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు నాడు నాటిన మొక్కను పరిశీలించి, ఆ చెట్టు వద్ద ఫోటో దిగారు.
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తుందని, నేడు మనం నాటే మొక్కనే రేపటి తరాలకు ఇచ్చే గొప్ప సంపద అనడానికి ఇలాంటి వనాలనే నిదర్శనమని సంతోషాన్ని వ్యక్తం చేశారు.
హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు.