పదవి విరమణ చేసిన ఎస్ఐ యం. దశరథ్ కు జిల్లా పోలీసు కార్యాలయములో ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సి.శశిధర్ రాజు దశరథ్ కు పూలమాల వేసి శాలువలతో ఘనంగా సన్మానించారు. పోలీస్ ఉద్యోగ నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి దశరథ్ అందరి మన్ననలను పొందారని ఆయన అన్నారు. పదవి విరమణ చేసిన దశరథ్ కు భవిష్యత్తు బాగుండాలని ఆశిస్తూ రిటైర్ మెంట్ బెనిఫిట్ పత్రాలు అందచేశారు.
ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ కానిస్టేబుల్ గా పోలీసు శాఖలో చేరి అమూల్యమైన సేవలు అందించి, తన సేవలకు గుర్తుగా ప్రభుత్వం నుండి, పోలీసు శాఖ నుండి అవార్డులు, రివార్డులు అందుకొని ఎస్ ఐ ఈరోజు దశరథ్ పదవి విరమణ చేశారని అన్నారు. “ పోలీసు రిటైర్ మెంట్ కేవలం వృత్తికే, కాని తన వ్యక్తిత్వానికి కాదు” అని ఎస్ పి అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శ్రీనివాస్ రావు, పీపీలు సంజయ్ వైరగి, రామకృష్ణ, రమణ రెడ్డి, రాజేశ్వర్ రావు, ప్రాసిక్యూషన్ డిప్యూటీ డైరెక్టర్ భద్రాద్రి, సి.ఐ.లు జాన్ దివాకర్, శ్రీనివాస్ రెడ్డి, జీవన్ రెడ్డి, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు వీరసత్ అలీ, దేవిదాస్, ప్రకాష్, మురాద్ అలీ, మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.