శ్రీ రామ నవమి పురస్కరించుకొని హనుమకొండ జిల్లా హాసన్ పర్తి ఆర్టీసీ కాలనీ లో నిర్వహించిన శ్రీ సీతారామ చంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి ములుగు ఎమ్మెల్యే సీతక్క హాజరయ్యారు. అదే విధంగా ములుగు పట్టణ కేంద్రంలో, కాశిం దేవిపేట గ్రామంలో,ఇంచెర్ల గ్రామంలో జరిగిన శ్రీ సీతారామ చంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి కూడా ఆమె విచ్చేశారు.
వేంకటా పూర్ మండల కేంద్రంలో జరిగిన శ్రీ సీతారామ చంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి కూడా హాజరైన సీతక్క స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చాల్వయి గ్రామంలో, గోవిందా రావు పేట మండల కేంద్రంలో, పసర, ముత్త పూర్ గ్రామంలో జరిగిన శ్రీ సీతారామ చంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి కూడా ఆమె హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి పైడాకుల అశోక్, మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఆకు తోట చంద్ర మౌళి, బండి శ్రీనివాస్, రసు పూత్ సీతారాం నాయక్ యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్,ఉపాధ్యక్షులు పెండం శ్రీకాంత్,సహకార సంఘం వైస్ చైర్మన్ మర్రి రాజు,మాజీ ఎంపీపీ జెట్టి సోమయ్య, పాలడుగు వెంకట కృష్ణ ఎంపీటీసీ గుండ బోయిన నాగలక్ష్మి,రాహుల్,ఎండీ ఆజ్జు చింత నిప్పుల భిక్ష పతి,గ్రామ సర్పంచ్ ఎండీ అహ్మద్ పాషా ముద్ద బోయిన రాము,ప్రభు తదితరులు పాల్గొన్నారు.