శివసేనకు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన ఏక్ నాథ్ షిండే పై ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారా? ఉన్నారనే చెబుతున్నది శివసేన ఆధీనంలోని మీడియా సంస్థ సామ్నా. షిండే వర్గానికి చెందిన 40 మంది ఎమ్మెల్యేలలో 22 మంది త్వరలో భారతీయ జనతా పార్టీలో చేరుతారని ఆ పత్రికలో వార్త వెలువడింది. ప్రస్తుత మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గంలోని వీరంతా మద్దతు ఇవ్వబోతున్నారని కూడా ఆ పత్రిక వెల్లడించింది.
అదే విధంగా మహారాష్ట్రలో గ్రామపంచాయతీ, సర్పంచ్ల ఎన్నికల్లో విజయం సాధించామని షిండే వర్గం చేస్తున్న ప్రచారం అవాస్తవమని పేర్కొంది. షిండే గ్రూపులోని 22 మంది ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు బీజేపీలో విలీనమవుతారని స్పష్టంగా తెలుస్తోంది. షిండే చర్యల వల్ల మహారాష్ట్ర చాలా నష్టపోయిందని, ఆ రాష్ట్రం ఆయన్ను క్షమించదని, షిండేను బీజేపీ తనకు అనుకూలంగా మలచుకోవడం కొనసాగిస్తుందని ఆ కాలమ్ పేర్కొంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా అభివృద్ధికి షిండే చేసిన కృషి కనిపించడం లేదని కాలమ్ పేర్కొంది.
దేవేంద్ర ఫడ్నవీస్ ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు. ఢిల్లీలో కూడా షిండే ప్రభావం లేదు. ముంబైని మురికివాడల నుంచి బయటకు తీసుకురావాలనే ప్రతిష్టాత్మక వ్యూహంలో భాగంగా ఫడ్నవీస్ మంగళవారం ఢిల్లీకి వెళ్లి, మహారాష్ట్ర ప్రభుత్వ రైల్వేల నుంచి ధారవి రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్ కోసం భూమి కోసం రైల్వే మంత్రిత్వ శాఖ నుండి అనుమతి పొందారు. ఉప ముఖ్యమంత్రి బలవంతుడు కావడంతో అందరూ ఆయన వైపే ఆకర్షితులవుతున్నారని సామ్నా పేర్కొంది.