అమరావతి రైతులు పాదయాత్ర చేస్తే అధికార పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏంటని విజయనగరం జిల్లా టీడీపీ ప్రశ్నించింది. అమరావతి రైతులు కానివ్వండి…అమలాపురం రైతులు కానివ్వండి.. అనంతపురం రైతులు కానివ్వండి సమస్యలు కోసం రాజ్యాంగం ఇచ్చిన హక్కు తోనే పాదయాత్ర లు చేస్తే..మీకొచ్చిన ఇబ్బందులు ఏంటని విజయనగరం జిల్లా టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు కిమిడి నాగార్జున ప్రశ్నించారు.
ఈ మేరకు అశోక్ బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమరావతి రైతులు రోడ్డు ఎక్కితే జగన్ కు సమస్య ఏంటని దుయ్యబట్టారు. రాజధానికి అభివృద్ధి కి ఏంటి సంబంధం అని అన్నారు. ఈ మూడేళ్ళ లో అసలు విశాఖ ను ఏ విధంగా అభివృద్ధి చేసారని ప్రశ్నించారు. విజయనగరం జిల్లా లో ఎయిర్ పోర్టు పనులు ఎందుకు ఆగిపోయాయని ప్రశ్నించారు. సంపద సృష్ఠిస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు.. నాగార్జున. మూడు రాజధానులతో అసలు ఏం అభివృద్ధి జరగదని…దానికి టీడీపీ అడ్డు పడుతోందని అనడం సమ్మతం కాదన్నారు.
కోర్టు సిగ్నల్ ఇచ్చిన తర్వాత వైఎస్సార్సీపీ నేతలు మాటలు సరికావని…ఈ మూడేళ్ళ లో జగన్ పార్టీ ఏం అభివృద్ధి చేసిందన్నారు. అభివృద్ధి చెయ్యక..అభివృద్ధి చెయ్యలేక..టీడీపీ ఎదురు దాడికి పాల్పడటమే కాక మూడు రాజధానుల అంశాన్ని వాడుకుంటోందన్నారు.విశాఖ ను కాస్మో సిటీలు ఉండాలన్నదే..టీడీపీ డిమాండ్ చేస్తోందన్నారు. చీపురు పల్లిని..విజయనగరాన్ని రాజధాని చేసెయ్యండని నాగార్జున ఎద్దేవా చేసారు. మన రాష్ట్రం నుంచీ పెట్టుబడి దారులు హైదరాబాద్ వెళ్లి పోవడంతో అనిశ్చిత ఏర్పడందని టీడీపీ నేత నాగార్జున స్పష్టం చేసారు. రాజధాని లో విశాఖ అభివృద్ధి చెందుతుందని వైఎస్సార్సీపీ చెప్పడం… సరి కాదని..ఈ మూడేళ్ళ లో ఆ పార్టీ ఏం చేసిందని నాగార్జున డిమాండ్ చేసారు.