రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ సరకులను తీసుకునే క్రమంలో తప్పకుండా సామాజిక దూరం పాటించాలని టి.ఆర్.యస్ పార్టీ నాయకుడు దూసరి శ్రీనివాస్ గౌడ్ కోరారు. హైదరాబాద్ నల్లకుంట డివిజన్ లోని సంజీవయ్య నగర్ బస్తి లోని రేషన్ షాపు లో సరకుల పంపిణీని నేను ఆయన పర్యవేక్షించారు. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనేక చర్యలు తీసుకుంటున్నారని యన అన్నారు.
దేశవ్యాప్తంగా అమలు జరుగుతున్న లాక్ డౌన్ కు అందరూ సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. లాక్ డౌన్ కారణంగా తాత్కాలికంగా ఉపాధి కోల్పోయిన వారిని ఆదుకోవడానికి ఉచితంగా బియ్యం సరఫరా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరికి బియ్యం అందేలా చర్యలు తీసుకోవాలని రేషన్ షాపు డీలర్ ను దూసరి శ్రీనివాస్ గౌడ్ కోరారు.