నవమాసాలు మోసి, కష్టపడి పెంచి తనను పెద్దవాడిని చేసిన కన్న తల్లిని ఓ కసాయి కొడుకు ఇంటి నుంచి నిర్దాక్షిణ్యంగా వెళ్లగొట్టిన సంఘటన ఇది. హైదరాబాద్ లోని బాగ్ అంబర్పేట్ బురుజు గల్లి హనుమాన్ టెంపుల్ ప్రాంతానికి చెందిన దేవమ్మ(85) కు శ్రీనివాసాచారి ఒక్కగానొక్క కుమారుడు.
భర్త మరణానంతరం దేవమ్మ కొడుకును కష్టపడి పెంచి పెద్ద చేసి ఆస్తిపాస్తులు ఇచ్చింది. ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్న శ్రీను తల్లి ఆలనాపాలనా పట్టించుకోవడం లేదు. మూడంతస్తుల భవనం ఉన్నప్పటికీ శ్రీను తల్లిని ఇంట్లోకి రానివ్వడం లేదు. తల్లి తిండి తిప్పలు కూడా అతను చూడడం లేదు.
దీంతో తల్లి దేవమ్మ బస్తీలో అరుగు మీద పడుకొని కాలం వెళ్ల తీస్తుంది. తెలిసినవారు పెట్టె తిండి తింటూ జీవచ్ఛవంలా ఉంటుంది. లాక్ డౌన్ సందర్భంగా స్థానిక టిఆర్ఎస్ నాయకుడు శ్రీరాములు ముదిరాజ్ మూడు నెలలపాటు దేవమ్మకు ఆహారాన్ని అందించారు. అయితే కొడుకు మాత్రం పట్టించుకోవడం లేదు.