దేశ ప్రజలు రామాలయం నిర్మాణం కోసం 5 శతాబ్దాలుగా నిరీక్షించారని, ఇప్పుడు ఆ కల నెరివేరిందని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి భూమి పూజ అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో యోగి ప్రసంగించారు.
రామాలయానికి భూమి పూజ చేయడంతో 113 కోట్ల మంది భారతీయుల కల నెరవేరిందని ఆయన అన్నారు. రామాలయం కోసం సుదీర్ఘ పోరాటం జరిగిందని, 5 శతాబ్దాల నిరీక్షణ తర్వాత.. ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా ఈ సమస్య పరిష్కారమైందని ముఖ్యమంత్రి అన్నారు.
ప్రపంచ స్థాయి మేటి విశిష్ట నగరంగా అయోధ్య రూపుదిద్దుకోబోతోందని ఆయన తెలిపారు.