26.7 C
Hyderabad
April 27, 2024 10: 29 AM
Slider జాతీయం తెలంగాణ

అంతర్గత భద్రతపై పరస్పర సహకారం

dgp confarence

దేశ అంతర్గత భద్రత పరిరక్షించే అంశాలలో పరస్పరం సహకరించుకోవాలని దక్షిణాది రాష్ట్రాల డీజీపీ సమావేశం నిర్ణయించింది. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో హైదరాబాద్ లో సమావేశమైన దక్షిణాది రాష్ట్రాల డీజీపీలు పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. శాంతి భద్రతలు,  సైబర్ నేరాలు, మావోయిస్టు కార్యకలాపాలు,  ఉగ్రవాదచర్యలు, మాదకద్రవ్యాల రవాణా తదితర అంశాలపై డీజీపీలు చర్చించారు. ఈ సమావేశంలో కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంద్రప్రదేశ్ లతో పాటు పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ నుంచి పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ నుంచి డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు అదనపు డీజీపీలు ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Related posts

హైకోర్టు జడ్జిల ఫోన్ ట్యాపింగ్ పై పిల్

Satyam NEWS

మున్సిపల్ సమావేశం తక్షణమే నిర్వహించాలి

Satyam NEWS

లాండ్ పూలింగ్ కు భూములిస్తాం: ముందుకు వచ్చిన మేడిపల్లి దళితులు

Satyam NEWS

Leave a Comment