జడ్జిల ఫోన్ ట్యాపింగ్ పై, తాను రేపు హైకోర్టు లో పిల్ వేస్తున్నట్టు,. మాజీ న్యాయమూర్తి, హైకోర్టు సీనియర్ న్యాయవాది శ్రవణ్కుమార్ వెల్లడించారు.
ఇది అత్యంత దారుణమైన విషయమని, మన దేశంలో ఎప్పుడూ ఇలాంటి పరిణామం జరగలేదని ఆయన అన్నారు. దీని పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని, తాను రేపు హైకోర్టు ముందుకు వెళ్తున్నానని ఆయన అన్నారు.
నిన్న ఆంధ్రజ్యోతి జడ్జిల ఫోన్ ట్యాపింగ్ పై కధనం వెలువడ్డది. దీనిపై ప్రభుత్వం ఆ పత్రికలకు లీగల్ నోటీసులు పంపింది.
ఈ దశలో తాను ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేస్తున్నట్లు శ్రవణ్ కుమార్ చెప్పారు. ఏం జరుగుతుందో వేచి చూడాలి.