బిచ్కుంద మండలంలో వర్షాకాలం (ఖరీఫ్ ) పంటల లో భాగంగా మండల రైతులు 1166 ఎకరాలలో సోయా విత్తనాలు విత్తగా ఎక్కడా ఒక్క మొక్క కూడా పెరగలేదు. దీంతో వారు వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించారు. ఆయన పంట చేలను పరిశీలించిన అనంతరం ఉన్నతాధికారులకు నివేదికలు పంపారు.
దీంతో సోమవారం సీనియర్ శాస్త్రవేత్త ఏరువాక కేంద్రం కోర్డినేటర్ డాక్టర్ ఎస్.నవీన్ కుమార్, ప్రాంతీయ చెరుకు. వరి పరిశోధన సంస్థ రుద్రూర్ శాస్త్రవేత్త డాక్టర్ ప్రవీణ్ కుమార్ పంట చేలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇరువురితో పాటు ఎడిఎ ఆంజనేయులు ఏఈఓ శ్రీలేఖ, ఏఈవో సౌమ్య, సొసైటి చైర్మన్ బాలాజీ, రైతులు దర్పల్లి సంజు పలువురు రైతులు ఉన్నారు.