రాక్షస పాలన అంతం చేయడమే వారాహి లక్ష్యం అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ ఇంద్రకీలాద్రి కింద జనసేన ఎన్నికల ప్రచార రథం వారాహి వాహనానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. అంతకు ముందు అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, గాజులు, పూలు సమర్పించిన పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్, మనోహర్ లకు ఈవో భ్రమరాంబ ఆలయం మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని అంతరాలయం గుండా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ కి ఆలయ ఆవరణలో వేద పండితుల ఆశీర్వచనం ఇచ్చారు.
previous post