32.7 C
Hyderabad
April 27, 2024 01: 08 AM
Slider కృష్ణ

రాక్షస పాలన అంతం చేయడానికే వస్తున్న వారాహి

#indrakeeladri

రాక్షస పాలన అంతం చేయడమే వారాహి లక్ష్యం అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ ఇంద్రకీలాద్రి కింద జనసేన ఎన్నికల ప్రచార రథం వారాహి వాహనానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. అంతకు ముందు అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, గాజులు, పూలు సమర్పించిన పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్, మనోహర్ లకు ఈవో భ్రమరాంబ ఆలయం మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని అంతరాలయం గుండా దర్శించుకొని  ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ కి ఆలయ ఆవరణలో వేద పండితుల ఆశీర్వచనం ఇచ్చారు.

Related posts

దినసరి కూలీలు, రైస్ మిల్లర్స్ యాజమాన్యం చర్చలు వాయిదా

Satyam NEWS

నువ్వు బతికి ఉన్నావా? ఆధారం ఏమిటి?

Satyam NEWS

గ్రీన్ ఛాలెంజ్ లో మొక్కలు నాటిన ఖమ్మం కలెక్టర్

Satyam NEWS

Leave a Comment