34.2 C
Hyderabad
May 19, 2025 17: 34 PM
Slider ఖమ్మం

గ్రీన్ ఛాలెంజ్ లో మొక్కలు నాటిన ఖమ్మం కలెక్టర్

#Khammam Collector

రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ కర్ణన్ మొక్కలు నాటారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఏ శరత్ కుమార్ విసిరిన ఛాలెంజ్ స్వీకరించి కలెక్టర్ కర్ణన్ కలెక్టరేట్ లో మొక్కలు నాటారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం లో తనను భాగస్వామ్యం చేసినందుకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్ కు కృతజ్ఞతలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం హరితహరానికి మద్దతుగా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది అని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమం ఒకరి ద్వారా మరొకరికి చేరేలా, ప్రతి గ్రామంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటే విధంగా చేస్తానని అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని  నల్గొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోలికేర్, వికారాబాద్ జిల్లా కలెక్టర్ అయేషా ముష్రాత్ కణంకు విసిరారు.

Related posts

అసభ్యంగా ప్రవర్తించిన గురువుకు జైలు శిక్ష

mamatha

బిజెపి పాలనపై పీడత ప్రజలు పోరాడాల్సిన సమయం ఇది

Satyam NEWS

వ‌ల‌స కార్మికుల‌కు ఐకేఆర్ ఫౌండేష‌న్ ట్ర‌స్ట్ బాస‌ట‌

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!