వంగవీటి మోహనరంగ జయంతిని పురస్కరించుకుని గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో రంగా విగ్రహానికి నరసరావుపేట నియోజకవర్గ టిడిపి ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా డా౹౹చదలవాడ మాట్లాడుతూ వంగవీటి రంగా వ్యక్తి కాదు. ఆయన ఒక శక్తి, ఆయన అందరికి ఆదర్శం అని అన్నారు. గత 30 ఏళ్ల నుండి వంగవీటి రంగా వర్ధంతి,జయంతి కార్యక్రమాలను దిగ్విజయంగా కొనసాగిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ కార్యదర్శి అల్లంశెట్టి మోహన్ రావు, టీడీపీ సీనియర్ నాయకులు కొల్లి బ్రహ్మయ్య,కొవూరి వెంకటేశ్వరరావు,ఏ వి ఆర్,అచ్యుత్,రమేష్, చిరుమామిళ్ల నరసింహ రావు,ఐల గోపి,రాజేష్, బొమ్మిశెట్టి సాయి,బంగారం,రాజా, సాయి వంశీ,భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఎం.ఎస్.సుధాకర్, సత్యంన్యూస్.నెట్