శ్రీ గాయత్రి జూనియర్ కళాశాల విద్యార్థిని సానియా జబీన్ స్టేట్ 5th ర్యాంకుతో 463/470 సాధించడం పట్ల ప్రిన్సిపాల్ సూరగౌని శ్రీనివాస్ గౌడ్ , కళాశాల యాజమాన్యం , అధ్యాపక బృందం అభినందనలు తెలిపారు. మారుమూల ప్రాంతమైన కొల్లాపూర్ నియోజక వర్గ విద్యార్థులకు శ్రీ గాయత్రీ విద్యా సంస్థల ద్వారా కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా విద్యను అందిస్తున్నట్టు సూరగౌని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
కార్పొరేట్ సంస్థలకు దీటుగా కొల్లాపూర్ లో శ్రీ గాయత్రి విద్యా సంస్థలు ఆధ్వర్యంలో నాణ్యమైన ఉన్నత విద్యను అందిస్తున్నట్లు వివరించారు. ఈ అవకాశాన్ని విద్యార్థినీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు రాష్ట్ర, డివిజన్, నియోజకవర్గ స్థాయిలో ప్రతిభను కనపర్చుతు మంచి ర్యాంకులు సాధించినట్లు ఆయన తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రైవేటు కళాశాలల సంఘ ఉపాధ్యక్షులు, శ్రీ గాయత్రి ఎడ్యుకేషన్స్ చైర్మెన్ సురగౌని శ్రీనివాస్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు.