38.2 C
Hyderabad
April 29, 2024 11: 56 AM
Slider జాతీయం

కూలిన మిగ్-21 జెట్.. వింగ్ కమాండర్ మృతి

భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 యుద్ధ విమానం రాజస్థాన్‌లోని జైసల్మేర్ సమీపంలో ప్రమాదవశాత్తూ కుప్పకూలింది. ఈ విమాన ప్రమాదంలో వింగ్ కమాండర్ హర్షిత్ సిన్హా వీరమరణం పొందారు.  బార్డర్‌లో శిక్షణ సమయంలో వైమానిక దళానికి చెందిన మిగ్ -21 బైసన్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ కూలిపోయినట్లు ట్విట్ ద్వారా వెల్లడించింది.

ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించినట్లు ఐఏఎఫ్ వెల్లడించింది. ఇంతకు ముందు కూడా మిగ్-21 విమానాలు ప్రమాదాల బారిన పడ్డాయి. ఈ సంవత్సరం ఐదు మిగ్ విమానాలు ప్రమాదాల బారిన పడ్డాయి. అయితే ఇండో-పాక్‌ బార్డర్‌ వద్ద ఈ ప్రమాదం జరగడంపై పలు అనుమానాలకు తావిస్తోంది.

కాగా.. 1971 నుంచి ఏప్రిల్ 2012 వరకు 482 మిగ్ విమానాలు ప్రమాదాలకు గురయ్యాయి. ఈ ఘటనల్లో 171 మంది పైలట్లు, 39 మంది పౌరులు, ఎనిమిది మంది సైనిక సిబ్బంది, ఒక ఎయిర్‌క్రూ మరణించారు.

Related posts

మిర్యాలగూడ లో ఘనంగా హరితహారం కార్యక్రమం

Satyam NEWS

మెగా సినిమాలు ఒకేరోజు రీ రిలీజ్ చేయకూడదనుకున్నాం

Bhavani

అమరవీరుల ఆశయాల కొనసాగింపులో భాగంగా ఉద్యోగుల నోటిఫికేషన్

Satyam NEWS

Leave a Comment