కడప జిల్లా రాజంపేట మండలం మన్నూరు పోస్ట్ ఆఫీస్ సబ్ పోస్ట్ మాస్టర్ వై.గురు స్వామి (35) కరోనా తో మృత్యవాతపడ్డారు. కరోనా సోకడంతో కడప లోని తిరుమల హాస్పిటల్ లో చికిత్స పొందు తూ మంగళవారం రాత్రి 11-30 గంటల ప్రాంతంలో మృతి చెందాడు. ప్ర స్తుతం మృతుడి భార్య గర్భవతి అని బంధువులు చెప్పారు. ఇదిలా ఉంటే మన్నూరు పోస్ట్ ఆఫీస్ లో మరో నలుగురు కరోనా భారిన పడ్డారు. వీరిలో పోస్టల్ అసిస్టెంట్ సుబ్బారాయుడు తిరుపతిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన పరిస్థితి కాస్త మెరుగ్గా ఉన్నట్లు పోస్టల్ సిబ్బంది తెలిపారు. మరో ముగ్గురు కరోనా నుంచి కోలుకుంటున్నారు.