లోక సంక్షేమం కోసం, కరోనా వ్యాధిని అరికట్టాలని శ్రీవారిని ప్రార్థిస్తూ టిటిడి చేపట్టిన రామయంణంలోని యుద్ధకాండ పారాయణం జూలై 10న శనివారం ముగియనుంది. తిరుమలలోని వసంత మండపంలో జూన్ 11న ఈ పారాయణ కార్యక్రమం ప్రారంభమైంది.
” సకృదేవ ప్రపన్నాయత వాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యః దదామ్యే తద్వ్రతం మమ ” మహామంత్రం ప్రకారం యుద్ధకాండలోని మొత్తం 131 సర్గలలో 5783 శ్లోకాలను 16 మంది ఉపాసకులు అత్యంత దీక్షా శ్రద్ధలతో పారాయణం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల కోసం ప్రతిరోజూ ఉదయం 8.30 గంటల నుండి ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది.
వసంత మండపంలో శ్లోక పారాయణంతోపాటు ధర్మగిరి వేద పాఠశాలలో మరో 16 మంది ఉపాసకులు 16 రోజుల పాటు జప, హోమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.