37.2 C
Hyderabad
May 1, 2024 11: 55 AM
Slider ఆధ్యాత్మికం

జూలై 10న ముగియనున్న యుద్ధ‌కాండ పారాయ‌ణం

#LordBalaji

లోక సంక్షేమం కోసం, క‌రోనా వ్యాధిని అరిక‌ట్టాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ టిటిడి చేపట్టిన రామ‌యంణంలోని యుద్ధ‌కాండ పారాయ‌ణం జూలై 10న శ‌నివారం ముగియనుంది. తిరుమ‌ల‌లోని వ‌సంత మండ‌పంలో జూన్ 11న ఈ పారాయ‌ణ కార్య‌క్ర‌మం ప్రారంభమైంది.

” స‌కృదేవ ప్ర‌ప‌న్నాయ‌త వాస్మీతి చ‌యాచ‌తే అభ‌యం స‌ర్వ‌భూతేభ్యః ద‌దామ్యే త‌ద్వ్ర‌తం మ‌మ‌ ” మ‌హామంత్రం ప్రకారం యుద్ధ‌కాండ‌లోని మొత్తం 131 స‌ర్గ‌లలో 5783 శ్లోకాల‌ను 16 మంది ఉపాసకులు అత్యంత దీక్షా శ్రద్ధలతో పారాయ‌ణం చేస్తున్నారు. ప్ర‌పంచవ్యాప్తంగా ఉన్న శ్రీ‌వారి భ‌క్తుల కోసం ప్ర‌తిరోజూ ఉద‌యం 8.30 గంట‌ల నుండి ఈ కార్య‌క్ర‌మాన్ని ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తోంది.

వ‌సంత మండ‌పంలో శ్లోక పారాయ‌ణంతోపాటు ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల‌లో మ‌రో 16 మంది ఉపాస‌కులు 16 రోజుల పాటు జ‌ప‌, హోమ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు.

Related posts

ఉత్తరాఖండ్లో నదిలో చిక్కుకున్న బస్సు

Bhavani

బిజెపి మైనారిటీ మోర్చా అధ్యక్షుడితో రహ్మతుల్లా భేటీ

Satyam NEWS

అవినీతికి పాల్పడ్డ ఐఏఎస్ లు మొత్తం 65 మంది….

Satyam NEWS

Leave a Comment