భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (64) ఆర్మీ ఆస్పత్రిలో చేరారు. ఎడమ కంటికి కాటరాక్ట్ (శుక్లం) శస్త్ర చికిత్స చేయించుకున్నారని రాష్ట్రపతి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్రపతికి కాటరాక్ట్ శస్త్ర చికిత్స జరిగిందని, సర్జరీ విజయవంతమైందని, ఆస్పత్రి నుండి డిశ్చార్జి అయినట్లు వివరించింది. కొన్ని రోజుల పాటు రాష్ట్రపతికి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారని పేర్కొంది.
previous post
next post