తెలుగుదేశం యువతరం నాయకుల సమావేశం సంచలనం కలిగిస్తున్నది. వంగవీటి రాధా, పరిటాల శ్రీరామ్, మరో యువనేత జీఎంసీ బాలయోగి తనయుడు హరీశ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో బలమైన రాజకీయ నేపథ్యమున్న ఈ మూడు కుటుంబాలకు చెందిన వారసుల తొలి సమావేశం చర్చనీయాంశమైంది. గతంలో వంగవీటి రాధా పై రెక్కీ ఘటనలో పరిటాల శ్రీరామ్ తీవ్రంగా స్పందించారు. అదే విధంగా ఈ ముగ్గురు యువ నాయకుల మధ్య గాఢమైన స్నేహం కూడా ఉంది. సోమవారం అమరావతి రైతుల మహాపాదయాత్రకు ఈ యువ నేతలు మద్దతు తెలపనున్నారు. పాదయాత్రలో పాల్గొనేందుకు రాజమహేంద్రవరం వచ్చిన రాధా, శ్రీరామ్ తో కలిసి ఓ ప్రైవేటు ప్రాంతంలో సరదాగా సమావేశమయ్యారు. అమరావతి రైతుల మహాపాదయాత్ర 36వ రోజు కొవ్వూరు నుంచి ప్రారంభమై గామన్ వంతెన (గోదావరి 4వ వంతెన) మీదుగా రాజమహేంద్రవరంలోకి ప్రవేశించనుంది.
previous post
next post