38.2 C
Hyderabad
April 29, 2024 13: 20 PM
Slider తూర్పుగోదావరి

అమరావతి రైతులకు తెలుగుదేశం యువ నేతల మద్దతు

#paritalasriram

తెలుగుదేశం యువతరం నాయకుల సమావేశం సంచలనం కలిగిస్తున్నది. వంగవీటి రాధా, పరిటాల శ్రీరామ్, మరో యువనేత జీఎంసీ బాలయోగి తనయుడు హరీశ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో బలమైన రాజకీయ నేపథ్యమున్న ఈ మూడు కుటుంబాలకు చెందిన వారసుల తొలి సమావేశం చర్చనీయాంశమైంది. గతంలో వంగవీటి రాధా పై రెక్కీ ఘటనలో పరిటాల శ్రీరామ్ తీవ్రంగా స్పందించారు. అదే విధంగా ఈ ముగ్గురు యువ నాయకుల మధ్య గాఢమైన స్నేహం కూడా ఉంది. సోమవారం అమరావతి రైతుల మహాపాదయాత్రకు ఈ యువ నేతలు మద్దతు తెలపనున్నారు. పాదయాత్రలో పాల్గొనేందుకు రాజమహేంద్రవరం వచ్చిన రాధా, శ్రీరామ్ తో కలిసి ఓ ప్రైవేటు ప్రాంతంలో సరదాగా సమావేశమయ్యారు. అమరావతి రైతుల మహాపాదయాత్ర 36వ రోజు కొవ్వూరు నుంచి ప్రారంభమై గామన్ వంతెన (గోదావరి 4వ వంతెన) మీదుగా రాజమహేంద్రవరంలోకి ప్రవేశించనుంది.   

Related posts

కరోనా ఎఫెక్ట్: రాజంపేటలో జనతా కర్ఫ్యూ సక్సెస్

Satyam NEWS

ఢిల్లీ స్పోర్ట్స్ యూనవర్సిటి తొలి వైస్ ఛాన్సలర్ గా తెలుగు మల్లి

Satyam NEWS

హైదరాబాద్ మునగడానికి కారణాలు తెలియవా?

Satyam NEWS

Leave a Comment