గడచిన రెండు వారాల నుంచీ ఏపీ లోని విజయనగరం జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీలతో శాఖా సిబ్బంది ని అలెర్ట్ చేస్తున్నారు. తాజాగా బొబ్బిలి డివిజన్ లో గరివిడి పోలీసు స్టేషన్ ను,బుదరాయవలస పీఎస్ లను ఆకస్మికంగా తనిఖీ చేసారు.ఈ మేరకు స్టేషనలను సందర్శించి, స్టేషను పరిసరాలను, రిసెప్షన్, స్టేషను రికార్డులు, సీడీ ఫైల్స్, క్రైం చార్ట్ లను తనిఖీ చేశారు. స్టేషను సిబ్బంది, మహిళా పోలీసులతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను, క్రైం ప్రాపర్టిని, రికార్డులను జిల్లా ఎస్పీ తనిఖీ చేశారు. ఎస్పీ వెంట బొబ్బిలి డిఎస్పీ బి.మోహనరావు, చీపురుపల్లి సీఐ జి.సంజీవరావు, ఎస్ఐ నవీన్ పడాల్ ,గరివిడి ఎస్ఐ లీలావతి ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
previous post