38.2 C
Hyderabad
April 27, 2024 15: 30 PM
Slider నెల్లూరు

సోమవారం పరీక్షను వాయిదా వేసిన వి ఎస్ యూ

#svu

నెల్లూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల్ని దృష్టిలో ఉంచుకొని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం సోమవారం జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసినట్లు రిజిస్ట్రార్ డా ఎల్ విజయ కృష్ణా రెడ్డి తెలిపారు. మంగళవారం నుంచి జరగాల్సిన పరీక్షలు యథాతథంగా  జరుగుతాయని తెలియచేసారు. సోమవారం నుంచి పి.జి ,యు.జి పరీక్షలు నిర్వహించేందుకు యూనివర్సిటీ అన్ని ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు. ఉదయం 9:00 గంటల నుంచి పి.జి మధ్యాహ్నం 2:00 గంటల నుంచి యు.జి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అధిక వర్షాలు వల్ల విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వీలుగా సోమవారం జరగాల్సిన పి.జి, యు.జి పరీక్షలను వాయిదా వేసినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల బాధ్యులు ఈ మార్పును గమనించి సోమవారం పరీక్ష పత్రాలు జాగ్రత్తగా పెట్టుకోవాలని సూచించారు. వాయిదా వేసిన పరీక్షలను చివరిలో నిర్వహిస్తామని తెలిపారు.

Related posts

దెబ్బలు నిజమైతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి

Satyam NEWS

శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అందరూ హాజరుకండి

Satyam NEWS

వనపర్తిలో మేఘా రెడ్డి ర్యాలీ

Satyam NEWS

Leave a Comment