టిడిపి అనుబంధ విభాగం రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన (ఆర్ బి ఎస్) రాష్ట్ర అధికార ప్రతినిధిగా నరసరావుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గూడూరు శేఖర్ నియమితులయ్యారు.
ఈ మేరకు బ్రాహ్మణ సంఘటన జాతీయ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద సూర్య, ఆర్.బి.ఎస్ రాష్ట్ర నూతన అధ్యక్షులు కోట ప్రసాద్ లు నియామక ఉత్తర్వులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా(ఆర్ బి ఎస్) అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేస్తూ ఆయనకు గుర్తింపును తెచ్చిపెట్టిన తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి, జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు , జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు (ఆర్,బి,ఎస్)జాతీయ అధ్యక్షులు వేమూరి ఆనంద సూర్యా, నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు లకు గూడూరు శేఖర్ కృతజ్ఞతలు తెలిపారు.