39.2 C
Hyderabad
April 28, 2024 13: 48 PM
Slider ముఖ్యంశాలు

ఎంపి మాధవ్ వ్యవహారం సిగ్గుచేటు: సాయినాథ్ శర్మ

#sainathsharma

వైసీపీ పార్టీ హిందూపూర్ పార్లమెంట్ సభ్యుడు గోరంట్ల మాధవ్ వ్యవహారం పార్లమెంటరీ వ్యవస్థకే సిగ్గుచేటని తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కడప జిల్లా  చెందిన కాశీ భట్ల సత్య సాయినాథ్ శర్మ అన్నారు మాధవ్ ను వైసీపీ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెస్తే ఆపార్టీకి బాగుంటుందని ఆయన ఎద్దేవా చేసారు.

శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు .ఒక బాధ్యతాయుత ఎంపీ స్థానంలో ఉండి తాను చేసిన నిర్వాకానికి చింతించాల్సింది పోయి తెలుగుదేశం పార్టీ నాయకుల పై కొన్ని మీడియా సంస్థలపై నిరాధార ఆరోపణలు చేయడం అతని నీచ మనస్తత్వానికి నిదర్శనమన్నారు. తాను చేసిన అవివేక పనికి వీడియో కాల్ లో మాట్లాడిన మహిళ కోటి రూపాయలు డిమాండ్ చేయగా 40 లక్షల రూపాయలు ఇస్తానని ఒప్పుకున్న మాధవ్ చివరకి ఆ డబ్బులు కూడా ఇవ్వక పోవడం తో మీడియా సంస్థలు  ఆ మహిళ మీడియా ఆశ్రయించిందని పుకార్లు షికార్లు చేస్తున్నాయన్నారు.

తన అసమర్థత తో తన స్థాయిని సైతం మరచి తప్పుగా ప్రవర్తించడమే కాకుండా తాను చేసిన నిర్వాకానికి తెలుగుదేశం  పార్టీ  నాయకులను బూచిగా చూపెట్టడం   ఎంత మాత్రం సమంజసమని ఆయన ప్రశ్నించారు వైసిపి పార్టీలో మహిళలతో అసభ్యంగా మాట్లాడే వారికి తెలుగుదేశం పార్టీపై పార్టీ నాయకులపై అసత్య పరోపణలు దాడులు చేసే వారికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవులు ఇతర ఉన్నత పదవులు ఇస్తున్నారన్న ఉద్దేశంతో గోరంట్ల మాధవ్ కూడా అలా చేసి ఉండొచ్చనని ఆ పార్టీ వర్గాల వారే పేర్కొంటున్నారన్నారు.

గోరంట్ల మాధవ్ ను వైసీపీ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేస్తే ఆ పార్టీకి చాలా మంచి పేరు వస్తుందని ఆయన ఎద్దేవా చేసారు . మహిళా సాధికారత గురించి గొప్పలు చెప్పుకునే వైసిపి ప్రభుత్వం లోని మహిళ మంత్రుల నోర్లు ఇప్పుడు ఎందుకు మూగబోయాయన్నారు. గోరంట్ల మాధవ్ వ్యవహారం చూసి ముఖ్యమంత్రి ముసి ముసి నవ్వులు నవ్వుకుంటు శభాష్ అని కూడా మనసులో చెప్పుకుంటునట్లు కొందరు చమత్కరించుకుంటున్నారన్నారు

ప్రజాస్వామ్య విలువలు ఉన్న ఏ పార్టీ అయినా ఇప్పటికే అటువంటి వ్యవహారంపై తగిన చర్యలు తీసుకొని అయితే ఇటువంటి వాటికి వత్తాసు పలికే నాయకత్వం ఉన్న వైసిపి మాధవ్ పై ఇంతవరకు ఎటువంటి చర్య తీసుకోకపోవడం ఆ పార్టీ ఇటువంటి వాటిని సమర్థిస్తుందనడానికి నిదర్శనమన్నారు.

Related posts

#AdoptGirlChild: జగనన్నకు ప్రేమతో నీ ఆర్ కె రోజా

Satyam NEWS

హైదరాబాద్ నగరానికి మరో వెయ్యి కోట్ల పెట్టుబడి

Satyam NEWS

అణగారిన వర్గాలకు టీడీపీ అండగా ఉంటుంది

Satyam NEWS

Leave a Comment