జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ అంతా గుంతల మయం అయిందని తెలుగుదేశం, జనసేన పార్టీలు ఆరోపించాయి. అధ్వానస్థితిలో ఉన్న రోడ్లపై తట్ట కంకరగాని తాపీ సిమెంట్ వేయలేని అధ్వాన్న స్థితిలో జగన్ రెడ్డి ప్రభుత్వముందని తాడిబోయిన హరికృష్ణ,హరిదాస్ గౌరీశంకర్ లు ఆరోపించారు. శనివారం తెనాలి నియోజకవర్గం తెలుగుదేశం జనసేనల అధిష్టాన ఆదేశాల మేరకు టిడిపి-జనసేన సంయుక్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెనాలి- విజయవాడ ప్రధాన రహదారి VSR& NVR college వంతెన సమీపంలో రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయని ప్రయాణకులకు తీవ్ర ఇబ్బంది తో ప్రమాదాలు జరుగుతూ ప్రాణాలు సైతం కోల్పోయే స్థితిలో ఉన్నాయన్నారు.
అధికారం చేపట్టి 4సంవత్సరాలు దాటినా కనీసం కంకర మట్టి కూడా వెయ్యలేని, ఒక గుంటని పూడ్చలేని చేతకాని దద్దమ్మ ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నిరసించారు. స్థానిక MLA అన్నాబత్తుని శివకుమార్ కు అధ్వాన్న రోడ్ల సంగతి గుర్తుండదు కాని విగ్రహాలు పెట్టడానికి, తెనాలి బండ్ కట్టడానికి మాత్రం కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేసే ఆలోచన తప్ప ఏంచేయలేదన్నారు. ఇకనైనా మొద్దునిద్ర వదిలి రోడ్లు మరమ్మత్తు చేయాలని డిమాండ్ చేశారు.