తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద, తెలుగుదేశం నాయకుల పై దాడులకు పాల్పడిన ప్రభుత్వ ఉగ్రవాద చర్యలకు నిరసనగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన దీక్షకు మాజీ యమ్.ఎల్. సి. రెడ్డి సుబ్రహ్మణ్యం, తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట ఇంచార్జ్ బండారు సత్యనందరావు సంఘీభావం తెలిపారు.
అధికారం అడ్డుపెట్టుకుని వైసిపి ప్రభుత్వం ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినప్పటికీ వారి ఆటలు సాగవని తెలుగుదేశం నాయకులు అన్నారు. అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులతో కలిసి తరలి వెళ్లి చంద్రబాబు నాయుడు చేస్తున్న దీక్షకు రామచంద్రపురం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ రెడ్డి సుబ్రమణ్యం, కొత్తపేట ఇంచార్జ్ బండారు సత్యనందరావు మద్దతు తెలియజేశారు.
వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రౌడీ మూకలు ధ్వంసం చేసిన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని నదీ జలాలతో సుబ్రహ్మణ్యం శుద్ధి చేశారు. దాడులతో అక్రమ అరెస్టులతో తెలుగుదేశం పార్టీని అణగదొక్కలేరని, చంద్రబాబు నాయుడు దీక్షకు మధ్ధతు లభించకుండా వైసీపీ ప్రభుత్వం ప్రజలను , తెలుగుదేశం పార్టీ శ్రేణులను పోలీసులతో అడ్డుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా అధిక సంఖ్యలో చంద్రబాబు దీక్షకు మద్దతు లభించటమే అందుకు సాక్ష్యం అని సుబ్రహ్మణ్యం అన్నారు.