38.2 C
Hyderabad
May 1, 2024 19: 24 PM
Slider చిత్తూరు

తెలుగుదేశం నేత పంటలను ధ్వంసం చేసిన వైసీపీ నాయకులు

#varla ramaiah

చిత్తూరు జిల్లా, తంబళ్లపల్లిలో తెలుగుదేశం పార్టీకి చెందిన సీతి భూమిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిలకు చెందిన మిరప పంట, డ్రిప్ వ్యవసాయ పైపులకు వైసీపీ నాయకుడు ఎస్. శంకర్ రెడ్డి, అతని కుమారులు నిప్పుపెట్టి తగులబెట్టారని తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్ల రామయ్య డిజీపీకి లేఖ రాశారు.

రాజకీయంగా ఎదుర్కోలేక అధికార వైకాపా నేతలు తెదేపా నాయకుల వ్యవసాయ పంటలను, పరికరాలను నాశనం చేశారని ఆయన తెలిపారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ నేతలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి మద్దతు పలికి ఆయన గెలుపునకు కృషి చేశారని, దీంతో అధికార వైకాపా స్థానిక నేతలు టీడీపీ నేతలపై ద్వేషం పెంచుకున్నారని ఆయన తెలిపారు.

మోటార్లు, డ్రిప్‌ ఇరిగేషన్‌ పైప్‌లైన్‌, స్టార్టర్లలకు నిప్పుపెట్టి టమాటా, మిర్చి పంటలను ధ్వంసం చేశారని డిజీపికి రాసిన లేఖలో వర్ల రామయ్య పేర్కొన్నాయి. పోలీస్‌స్టేషన్‌ లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకుండా పోలీసులు రాజీ కుదిర్చేందుకు వైసీపీ నాయకుల తరపున ఫిర్యాదుదారులతో బేరసారాలు ఆడుతున్నారని, అందువల్ల తక్షణమే ఫిర్యాదు నమోదు చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Related posts

ములాయం స్థానంలో ఆయన కోడలు పోటీ

Satyam NEWS

ఆర్యవైశ్య పంచాంగకర్త డా॥ సోమవరపు రామలింగయ్య గుప్త పంచాంగ ఆవిష్కరణ

Satyam NEWS

జపనీస్ పార్కును సద్వినియోగం చేసుకోవాలి

Bhavani

Leave a Comment