31.7 C
Hyderabad
May 2, 2024 08: 31 AM
Slider ముఖ్యంశాలు

మంత్రికి రూ.126 కోట్లు, ఎమ్మెల్యేకు రూ.186 కోట్లు

#KesineniNani

టీడీపీ ఎంపీ కేశినేని సంచలన ఆరోపణలు చేశారు. జగన్ సర్కార్ కొంతమందికి కాంట్రాక్ట్‌లను పంచి పెట్టిందంటూ ట్వీట్ చేశారు. ఎవరెవరికి ఎంత కట్టబెట్టారో వివరాలు కూడా ప్రస్తావించారు.

‘నిన్న మొత్తం జగన్ మోహన్ రెడ్డి తనవారికి పంచిన రోడ్డు కాంట్రాక్టులు రూ.791.53 కోట్లు.. ఆ కాంట్రాక్ట్స్ దక్కించుకున్న కంపెనీల వివరాలు.. PLR (పెద్దిరెడ్డి) : రూ.126 కోట్లు.. NSPR (నర్రెడ్డి.. పులివెందుల YS చుట్టం): రూ.228 కోట్లు.. KCVR (సురేష్ రెడ్డి): రూ.128.36 కోట్లు.. Nitin Sai (పార్థసారధి YCP):రూ.121.63 కోట్లు.. JMC ( శ్రీనివాసులు చిత్తూర్ YCP MLA):రూ.186.కోట్లు’అని ఆరోపించారు.

ఏపీ ప్రభుత్వం ఇటీవల ఐదు జిల్లాల్లో చేపట్టే రోడ్డు పనులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించింది. చిత్తూరు, కడప, కర్నూలు, ప్రకాకశం, అనంతపురం జిల్లాల్లో ఈ పనులు నిర్వహించున్నారు..

మొత్తం రూ. రూ.791.53 కోట్లకు టెండర్లు పిలిచి.. రివర్స్ బిడ్డింగ్ నిర్వహించారు. చిత్తూరు జిల్లాలో పనుల్ని పెద్దిరెడ్డి, కర్నూలు జిల్లాలో పనుల్ని వైఎస్ బంధువులు, కడపలో పనుల్ని వైఎస్సార్‌సీపీ పార్థసారధి,

అనంతపురం జిల్లాలో పనుల్ని కేసీఆర్, ప్రకాశం జిల్లాలో పనుల్ని చిత్తూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే శ్రీనివాసులు దక్కించుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ కేశినేని నాని ట్వీట్ చేశారు.

Related posts

బయో డీజిల్ స్టాక్ పాయింట్ ప్రారంభం

Sub Editor

హైదరాబాద్ కేంద్రంగా రూ 700 కోట్లతో స్కై వర్త్ కంపెనీ

Satyam NEWS

నెల్లూరు జిల్లా అడ్మిన్ అదనపు ఎస్ పి గా హిమవతి

Satyam NEWS

Leave a Comment