30.7 C
Hyderabad
April 29, 2024 06: 24 AM
Slider గుంటూరు

ఆదుకోని ప్రభుత్వం కారణంగా ప్రమాదంలో ప్రజారోగ్యం

#TDP NRT

రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలన కారణంగా ప్రజారోగ్యం ప్రమాదంలో పడిందని గుంటూరు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు.

కరోనా వారియర్స్ కు బీమా సౌకర్యం కల్పించాలని, కరోనాతో చనిపోయిన ప్రజలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నరసరావుపేట సబ్-కలెక్టర్ కార్యాలయం ఎదుట నేడు తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అరవింద బాబు మాట్లాడుతూ ఆసుపత్రులలో వైద్య సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆయన అన్నారు. బ్లాక్ ఫంగస్ మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షలు, ఆక్సిజన్ లేక సంభవించిన మరణాలకు రూ.25 లక్షలు ఎక్స్ గ్రేషియో చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

కరోనా కాలంలో తెల్ల రేషన్ కార్డుదారులకు రూ.10 వేలు ఆర్థిక సాయం అందించాలని, పేదవారి ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్ లను వెంటనే తెరవాలని ఆయన డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి 50 లక్షల బీమా సౌకర్యం కల్పించిందని, అదే విధంగా ఏపీ జర్నలిస్టులను కారోనా వారియర్స్ గా గుర్తించి వారికి కూడా భీమా సౌకర్యం కల్పించాలని అరవిందబాబు డిమాండ్ చేశారు.

Related posts

ములుగు ఎస్ పిని కలిసిన సీఐ రవీందర్

Satyam NEWS

ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న అభిలాష రావు

Satyam NEWS

సర్వ మతాలకు ఆలయం గ్రంథాలయం

Bhavani

Leave a Comment